భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ దుర్మార్గుడు ఏకంగా ఆమె తల నరికి తలతోనే నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లాడు. తన భార్యను పొలంలోకి ఈడ్చుకెళ్లి అతి దారుణంగా గొంతు కోసి మొండాన్ని వేరు చేశాడు. ఈ విషాద ఘటన కడప జిల్లా సంబేపల్లెలో చోటు చేసుకుంది. సంబేపల్లె మండలం దుద్యాల పంచాయతీ దుద్యాలవడ్డెపల్లెకి చెందిన పసుపులేటి రాణి (32), అదే గ్రామానికి చెందిన వెంకటరమణలకు 1999లో వివాహమైంది. వీరికి కుమారుడు మహేష్ కూడా ఉన్నాడు. బతుకుదెరువు కోసం ఇటీవల గల్్కకు వెళ్లిన రాణి సుండుపల్లె మండలానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై గతంలో పలుమార్లు రాణి భర్త వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించాడు. ఈ విషయం పై కేసు కూడా నమోదైంది. ఇదే క్రమంలో భర్త వారం రోజులుగా వారిని కాపు కాచాడు. మంగళవారం రాత్రి ఆమె ప్రియుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా దుద్యాల చెక్పోస్టు వద్ద కొడవలితో అడ్డగించాడు. వాహనాన్ని ఆపుతూనే ప్రియుడు.. రాణిని కిందికి దిగమన్నాడు. ఇదే క్రమంలో వెంకటరమణ భార్యను పట్టుకుని దారుణానికి ఒడిగట్టాడు. ద్విచక్రవాహనంపైనే ఉన్న ప్రియుడు పరారయ్యాడు. ఆమెలో మార్పు రాకపోవడంతోనే తాను నరికేశానని పోలీసుల ఎదుట వెంకటరమణ అంగీకరించాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు.