గద్వాల ప్రాంతంలో బహుజన నాయకత్వం ఏర్పాటు చేయాలి.. BLF అభ్యర్థి రంజిత్ కుమార్ // NSR NEWS

Опубликовано: 21 Июнь 2025
на канале: NSR NEWS LIVE
14,364
227

బహుజన నాయకులు ఐక్యంగా ఉండి, బంగ్లా తలుపు వద్ద ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని రంజిత్ అన్నారు. గద్వాల ప్రాంతంలో బహుజన నాయకత్వం ఏర్పాటు చేయాలని గద్వాల బిఎల్ఎఫ్ అభ్యర్థి రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన బహుజన ఎన్నికల శంఖారావ సభలో ఆయన మాట్లాడుతూ గద్వాల ప్రాంతంలో ఎస్టీ,ఎస్సి,మైనార్టీల అభివృద్ధి ని బంగ్లా వాళ్ళు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన ఎన్నికల శంఖారావాన్ని ఉద్దేశించి 15 రోజుల నుండి గ్రామాలలో బహుజన నాయకులు, ప్రజల వద్దకు వెళ్ళితే బంగ్లా వాళ్ళకు ఎందుకు కడుపులో మంట అని అన్నారు. గద్వాల కోటలో బహుజన జెండా ఎగురవేసే వరకు పోరాడుదాం మని పిలుపునిచ్చారు. బంగ్లా రాజకీయాలు కట్టు చేయాలని అన్నారు. బహుజన నాయకులు బంగ్లా తలుపులు వద్ద ఉండి ఆత్మగౌరవన్ని చంపు కుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మనం అందరం ఐక్యంగా ఉండి, బంగ్లా ఆధిపత్యం అంతం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. గద్వాల ప్రాంత ప్రజల అభివృద్ది, సంక్షేమం పట్టించుకోని పాపాన పోలేదని, అభివృద్ధి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. బంగ్లా వాళ్ళు నన్ను అనుమానం కల్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మీ ఆశీర్వవాదం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.